Vol. 8, Issue 6, Part G (2022)
తిక్కన నాటకీయత
తిక్కన నాటకీయత
Author(s)
డాII వి. నారాయణప్ప
Abstract
కవిత్రయంవారిలో పదునైదు పర్వములను భారతాంధ్రీకరణ చేసిన భాగ్యము తిక్కనకు దక్కినది. తాను కవియై, పూర్వకవులను కూడా గౌరవించిన వారిలో తిక్కన ప్రథమగణ్యుడు. తిక్కన నెల్లూరు మండలమునేలిన మనుమసిద్ధి ఆస్థానకవి. మనుమసిద్ధి దాయాదులవలన కోల్పోయిన రాజ్యమును తిక్కన తన రాజ్యతంత్రజ్ఞతలో మరల సంపాదించి పెట్టినవాడు. రాజకీయపుటెత్తులు నెరిగినవాడు. మహాభారతములో తిక్కన నాటకీయత కేవలము కథ సంభాషణ రూపమున నడుపుటలో లేదు. నాటకములో నుండెడు సంధి బంధములను దృష్టి నుంచుకొని, సన్నివేశములను కల్పించి, అందలి పాత్రల మనోవికారాదులను చిత్రించుటలో నుండును. తిక్కన భారతమును చదువుచున్నప్పుడు కథను చదువుచున్నట్లుగాక నాటకమును చూచుచున్న భావన కలుగును. తిక్కన నాటకీయత అధికముగా ఇమిడియున్న విరాటోద్యోగ పర్వములందు సందర్భోచితముగా కొన్ని పద్యములందు చర్చించాను గమనించవచ్చును.
How to cite this article:
డాII వి. నారాయణప్ప. తిక్కన నాటకీయత. Int J Appl Res 2022;8(6):509-517.